‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే.  తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిలో ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు రద్దు కావడంతో ఇంటికే పరిమితైమన ఈ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తన తదుపరి చిత్రాల స్క్రిప్ట్‌ పనిలో నిమగ్నమయ్యారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరూప్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌, ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు.